Supreme Court | పిటిషన్ కొట్టివేత

Supreme Court | పిటిషన్ కొట్టివేత
Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ విషయంలో ఎలాంటి కామెంట్లు చేయకుండా నిలువరించాలని మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు.
ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించినట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది.
