దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచే నెగటివ్గా ప్రారంభమయ్యాయి.
అప్పుడప్పుడూ కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరిగి, మార్కెట్ కొద్దిసేపు లాభాల్లోకి వెళ్లినప్పటికీ, ఆటో, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు పెరగడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకుంది.
సెన్సెక్స్ ఈరోజు 81,465 పాయింట్ల వద్ద ప్రారంభమై ట్రేడింగ్ సమయంలో 81,286 వరకు పడిపోయింది. చివరికి ఇది 182 పాయింట్ల నష్టంతో 81,451 వద్ద ముగిసింది.
అలాగే, నిఫ్టీ కూడా 82 పాయింట్లు తగ్గి 24,750 వద్ద క్లోజ్ అయింది. రూపాయి మారకపు విలువ కూడా డాలర్తో పోల్చితే 85.57 వద్ద ముగిసింది.
ప్రధానంగా హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అయితే ఎటర్నల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కొన్ని కంపెనీలు మాత్రం లాభాలను నమోదు చేశాయి.
అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.41 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,296 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.