సోంపేట, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో నూతన ఉత్సాహ తరంగ కెరటాలు శనివారం ఉదయం నుంచి పొంగుతున్నాయి.. చిట్టి తాబేళ్ల బుల్లి అడుగులకు.. సూర్యోదయ సముద్ర కెరటాలకు.. భానుడి కిరణ స్పర్శ అలల సవ్వడి తీరంలో సందడి చేశాయి మరి కొన్ని గంటల కాల వ్యవధిలో చారిత్రాత్మక మార్పునకు బీజం పడనుంది. వనభోజనాలకు, సార్థకర్మలకు, సంబర మహోత్సవ స్నాన ఘట్టాలకు పరిమితమైన బారువ సముద్ర తీరం, జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమాలకు వేదిక కానుంది. రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా పరివర్తనం చెందే కాలంలోకే పోబోతుంది. జిల్లా కలెక్టర్ పట్టుదలతో, ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో బారువ సముద్ర తీరం పర్యాటక శోభను సంతరించుకుంది. ఇప్పటికే తాబేళ్ల ఉత్సవంతో ప్రజల మన్ననలను అందుకున్న అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. వరుసగా రెండు రోజులు ఫెస్టివల్ వేడుక ఉత్సాహాన్ని ఇస్తుంది. శనివారం ఉదయం నుంచి సందర్శకులతో తీరం పోటెక్కింది.
పకడ్బందీ ఏర్పాట్లు
బారువా బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు పక్కాగా చూసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.బారువా బీచ్ ఫెస్టివల్స్ పై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి ఆయన జిల్లా అధికారులతో ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. స్పోర్ట్స్ ఏర్పాట్లు పై చర్చించారు.పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి చర్చించారు. బీచ్ అంతా పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.అనంతరం ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రములో విడిచిపెట్టారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ దొనక పృధ్వి రాజ్ కుమార్, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, జి. వెంకటేష్, ఆర్ అండ్ బీ ఎస్ఈ జాన్ సుధాకర్, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథ్ స్వామి, జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్య, జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ఉద్యాన వన శాఖ జిల్లా అధికారి ప్రసాద్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

తూర్పు తీర ఆణిముత్యం.. బారువ తీరం
శ్రీకాకుళం జిల్లా తూర్పు తీరంలో ఆణిముత్యంలా వెలిగిపోతున్న బీచ్లలో బారువ బీచ్ ఒకటి. ప్రకృతి సౌందర్యం, ప్రశాంతత, చారిత్రక ప్రాధాన్యం కలగలిపిన ఈ బీచ్ 100 ఏళ్ల నౌక అవశేషాలను దాచుకున్న రహస్య గుట్టుగా ఉంది. తాజాగా ఇక్కడ మొదలైన బారువ బీచ్ ఉత్సవం తో ఈ ప్రాంతం కొత్త శకం వైపు అడుగులు వేస్తోంది. గత ఏప్రిల్ 19న కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రారంభించిన ఈ ఉత్సవంలో పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా ఒలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలో వదిలారు. ఈ తాబేళ్లు భారీగా గూడులు వేసే ప్రత్యేకత కలిగినవి. వాటి సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
పర్యాటకులకు పండగ వాతావరణం
ప్రజలకు ఉత్సాహాన్నిచ్చేలా ఆటలు, వినోద కార్యక్రమాలు, రుచుల పండుగతో ఈ ఉత్సవాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. బీచ్ పక్కనే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్కోర్టులో స్థానిక రుచులు, సముద్ర ఆహార వంటకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు, కుటుంబాల కోసం రోలర్ రైడ్స్, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి సాయంత్రం సందడిని పెంచుతున్నాయి. బీచ్ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు వాలీబాల్, శాండ్ ఆర్ట్, ట్రెజర్ హంట్లాంటి ఆటలు నిర్వహించనున్నారు.
రాబోవు రోజుల్లో సముద్రంలో స్పోర్ట్స్
రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి సీ కయాకింగ్ పోటీలు, స్టాండ్అప్ ప్యాడ్లింగ్ పోటీలు ప్రారంభించనున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, బారువ బీచ్ వద్ద దాగున్న శతాబ్దాల నౌక అవశేషాలను గైడ్లతో చూడటానికి ప్రత్యేక అవకాశాలూ కల్పించనున్నారు. ఈ ఉత్సవం శ్రీకాకుళాన్ని పర్యాటక రంగంలో నిలిపే దిశగా ఒక తొలి అడుగు. ప్రకృతికి అనుకూలంగా, స్థానిక ఆచారాలను పదిలంగా ఉంచేలా ఈ ఉత్సవం ప్రణాళికబద్ధంగా అమలవుతోంది. భవిష్యత్తులో బారువ బీచ్ను రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రముఖ బీచ్ టూరిజం కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
తొలి రోజు కార్యక్రమాలు
పండుగ మొదటి రోజు(శనివారం )ఉదయం 5:30 గంటలకు తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. తరువాత 6 గంటలకు బీచ్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు బీచ్ వాలీబాల్ లేదా తాడు లాగుట పోటీలతో పండుగ ప్రారంభమైంది. అదే సమయంలో నీరు, సాహస క్రీడలు ప్రజల కోసం తెరుస్తారు. ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు స్టేట్ సీ కయాకింగ్, స్టాండ్-అప్ పాడ్లింగ్ ఛాంపియన్షిప్ అర్హత రౌండ్లు జరిగాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఓపెన్ ఆర్ట్ పోటీని నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ఆర్ట్ జోన్లో లైవ్ శాండ్ స్కల్ప్చర్ ఆర్ట్ ప్రదర్శన చేపట్టారు. 11గంటల నుంచి సాయంత్రం 3 వరకు ఆహార స్టాల్స్, ప్రదర్శనలు, బీచ్లో వినోద కార్యక్రమాలతో విరామ సమయం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రముఖుల రాక ఉంటుంది. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు స్టేట్ సీ కయాకింగ్, స్టాండ్-అప్ పాడ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరుగుతాయి. సాయంత్రం 5:30 గంటలకు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు యాశస్వి కొండేపూడిచే సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది.
ఆదివారం.. ఆనంద వారం..
రెండవ రోజు ఆదివారం ఉదయం 5:30 గంటలకు తాబేలు పిల్లల విడుదల కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటలకు బీచ్లో ధ్యానం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు నీరు, సాహస క్రీడలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటలకు శాండ్ స్కల్ప్చర్ ఆర్ట్ పోటీల ఫైనల్స్ ఉంటాయి. ఉదయం 10:00 గంటలకు ఓపెన్ ఆర్ట్ పోటీలో గెలుపొందిన కళాకృతుల ప్రదర్శన ఉంటుంది.ఉదయం 11నుంచి సాయంత్రం 3 గంటల వరకు స్థానిక వంటకాలతో విరామ సమయం, నెట్వర్కింగ్, ప్రకృతి నడకలు, నిధి వేట ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు జానపద సాంస్కృతిక ప్రదర్శనలు, కథా కథనాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు ఫైర్ షో ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలో పండుగ సినిమాను ప్రదర్శిస్తారు. పండుగలో సాహస క్రీడలు, కుటుంబ