ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ డీలా పడిపోయింది. నేటి మ్యాచ్ లో ముంబై పై చెలరేగుతుందని అనుకున్న హైదరాబాద్ జట్టు సీన్ కాస్త రివర్స్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన హైదారబాద్ కు ముంబై బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
ఆరెంజ్ ఆర్మీ టాపార్డర్ ముంబై ధాటికి కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (0), ఇషాన్ కిషన్ (1), అభిషేక్ శర్మ(8), నితిష్ కుమార్ రెడ్డి (2), అనికే వర్మ (12) పరుగులకే పెవిలియన్ క్యూ కట్టారు. దాంతో 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానిక 52 పరుగులు చేసింది.