వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సింగయ్య ( Singaiah) మృతి కేసు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ( Ys Jagan Mohan Reddy) సత్తెనపల్లి ( Satthenapally) పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ ( Convoy) కింద పడి… సింగయ్య మరణించినట్లు వీడియో వైరల్ అయింది. ఈ తరుణంలోనే.. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్, అలాగే ఆయన, ఇతర వైసీపీ నేతలపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇలాంటి నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ కార్యకర్త సింగయ్య కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు కొట్టేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది.