Sangareddy | పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సంగారెడ్డి, మార్చి 12 (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సెయింట్ ఆంథోని పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప‌రిశీలించారు. ఈనెల 6వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.

పరీక్ష కేంద్రాల వద్ద 125 బి.యన్.యస్.యస్, (144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడానికి వీల్లేద‌ని, 100మీటర్ల దూరం వరకు ఉదయం 9నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకూడదన్నారు. పరీక్ష కేంద్రాల లోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని సిబ్బందికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *