Yadagirigutta | సంప్రోక్షణ మహోత్సవం.. సీఎం రేవంత్ కు ఆహ్వానం !
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.
ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యదర్శి శైలజా రామయ్యర్తో పాటు ఆలయ ఈఓ, అర్చకులు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 23న నిర్వహించనున్న స్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.