AP | కాకాణితో స‌జ్జ‌ల ములాఖ‌త్..

నెల్లూరు : వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయ్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిని జైలుకు పంపించారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు. వైఎస్సార్‌సీపీలో ఉండే సీనియర్‌ నేతలను టార్గెట్‌ చేశారని మేం ముందే అనుకున్నామ‌న్నారు. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుందన్నారు.

చంద్రబాబు దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం. రాష్ట్రంలో సిస్టమ్‌ ఫెయిల్‌ అయ్యింది. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారని ఆయ‌న అన్నారు. గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో త‌మ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ఆయనపై అనేక కేసులున్నాయి. లిక్కర్‌ కేసులో బెయిల్‌ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్‌ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్‌ జగన్ అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *