జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో జట్టు రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ కు 8 పరుగులు కావాల్సి ఉండగా.. ఆవేష్ ఖాన్ అద్బుతంగా డిఫెండ్ చేశాడు.
చివరి ఓవర్లో రాజస్థాన్ కు 8 పరుగులు అవసరం కాగా, లక్నో బౌలర్ అవేష్ ఖాన్ అద్భుతంగా డిఫెండ్ చేశాడు. కేవలం 6 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దానితో, లక్నో రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టును ఓడించింది.
181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే, డెత్ ఓవర్లలో పుంజుకున్న లక్నో బౌలర్లు… రాజస్థాన్ కు దెబ్బ తీశారు. 8వ ఓవర్లో రెండు వికెట్లు తీసిన అవేష్ ఖాన్, చివరి ఓవర్లోనూ ఒక వికెట్ తీసి రాజస్థాన్ కు షాకిచ్చాడు.
రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ జైస్వాల్ (74) అర్ధశతకంతో రాణించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో డెబ్యూట్ చేసిన
14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్సులతో 34) ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (39) కూడా రాణించగా.. ఆఖరి ఓవర్లు ఆడిన షిమ్రాన్ హెట్మెయర్ (12), దృవ్ జురేల్ (6), శుభమన్ దూబే (3) చెత్త బ్యాటింగ్ తో నిరాశ పరిచారు.
లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లతో మెరిశాడు. శార్దూల్ ఠాకూర్, ఐడెన్ మార్కర్ తలా ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో.. రాజస్థాన్ పై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. ఐడెన్ మార్కరమ్ (66), ఆయుష్ బదొని (50) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఇక ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగాడు. అయితే, లక్నో బ్యాటర్లలో వీరు మినహా మరే ఆటగాడు రాణించలేకపోయారు.
ఇక రాజస్థాన్ బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, సందీప్ శర్మ, తుషర్ దేశ్ పాండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ విజయంతో తమ ఖాతాలో 10 పాయింట్లు వేసుకున్న లక్నో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి చేరుకుంది.