Tributes | మురళి నాయక్ కుటుంబానికి పవన్ కల్యాణ్ అండ

శ్రీ సత్యసాయి. (ఆంధ్రప్రభ): రాష్ట్ర డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం 9:30 గంటలకు గోరంట్ల మండలం కల్లి తండా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన వీర జవాన్ మురళి నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, అనంతరం మురళి తల్లిదండ్రులు శ్రీరామ నాయక్, జ్యోతిబాయ్ లను ఓదార్చారు.

ముఖ్యంగా మురళి నాయక్ తల్లి జ్యోతిబాయ్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకొని, కుమారుడి మరణం వీర మరణమని, వీరమరణం పొందిన మురళి నాయక్ ఆశయం కోసం తాము ఉన్నామన్నారు. ఎలాంటి అధైర్యానికి గురి కాకుండా ఓర్పు వహించాలని కోరారు. భవిష్యత్తులో మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Leave a Reply