KHM | రేణుకా చౌదరికి కోర్టులో ఊరట

ఖమ్మం లీగల్, ఆంధ్రప్రభ : మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury) కి కోర్టులో ఊరట ల‌భించింది. 2014 సంవత్సరంలో భూక్య రాంచి సతీమణి కళావతి (Kalavati) వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాననీ మోసం చేశారని ఆరోపిస్తూ.. ప్రైవేట్ కంప్లైంట్ (Private Complaint) ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసుపై ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం సాక్షులను విచారించి నేరం రుజువు కాకపోవడంతో శుక్రవారం కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రేణుక చౌదరి తరఫున సీనియర్ న్యాయవాదులు ఎం.నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించారు. జిల్లా కోర్టు వద్ద నుండి భారీ ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్న రేణుక చౌదరికి ఆమె అనుచర గణం ఘనంగా స్వాగతం పలికింది.

Leave a Reply