రూ.139 కోట్ల భూమిలో ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా పంజా(Hydra Claw) విసుతున్న సంగత విదితమే. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజేంద్రనగర్(Rajendranagar)లో ఈ రోజు రూ. 139 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది.
రంగారెడ్డి(Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ మండలంలో బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లలో ఆక్రమణలకు గురైన నాలుగు పార్కుల(Parkula) స్థలాన్నిరక్షించారు. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.