Re release | త్వ‌ర‌లో మ‌రోసారి బిగ్ స్రీన్ పై ‘కుమారి 21F’

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా సుకుమార్ రైటింగ్స్‌పై ప్రొడ‌క్ష‌న్స్ లో వ‌చ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కుమారి 21F’. పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ మేజర్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

2015లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతుండటంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు.

Leave a Reply