ADB | జన్నారం జీసీసీ ఇన్‌చార్జి మేనేజర్‌గా రాజ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

జన్నారం (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం జీసీసీ ఇన్‌చార్జి మేనేజర్‌గా చర్లపల్లి వాసి మరిపెళ్లి రాజ్ కుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఉట్నూర్ ఐటిడిఏ పీవో కుష్బూ గుప్త ఉత్తర్వుల మేరకు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్‌ను తాత్కాలికంగా ఇన్‌చార్జి మేనేజర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ఉట్నూర్ జీసీసీ డీఎం సందీప్ కుమార్ కార్యాలయం ద్వారా జన్నారం జీసీసీకి చేరాయి.

ఇప్పటివరకు మేనేజర్‌గా విధులు నిర్వహించిన భూక్య బాలాజీపై విధులలో నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో పీఓ సస్పెన్షన్ విధించగా, ఆయన స్థానంలో రాజ్ కుమార్‌ను నియమించారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజ్ కుమార్‌కు జీసీసీ కార్యాలయ అకౌంటెంట్ లక్ష్మణ్, కంప్యూటర్ ఆపరేటర్ మల్లేష్, సేల్స్‌మెన్ ప్రభాకర్, సబార్డినేట్ భీమయ్య తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply