WGL | సీఎం పర్యటనలో ప్రోటో కాల్ రగడ

ఎంపీ గడ్డం వంశిని అవమాంచారని ఆందోళన


ఆంధ్రపభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో జరిగే సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ ఫోటో పెట్టలేదని, దళిత ఎంపీ అని జిల్లా అధికార యంత్రాంగం చిన్నచూపు చూశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నిరసన వ్యక్తం చేశారు.

గురువారం సరస్వతి ఘాట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరమే అక్కడికి చేరుకున్న చెన్నూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి అక్కడి నుండి తరలించారు.

Leave a Reply