చరిత్ర సృష్టిస్తుంది..

ఈ సంఘటన తరతరాలుగా చెప్పుకోవాలి…
మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పొంగూరి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి..


నంద్యాల బ్యూరో, అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ) : రాయలసీమ (Rayalaseema) అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి నంద్యాల కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన జరగనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఈ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం బుధవారం నంద్యాలకు చేరుకుంది. ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (Minister NMD Farooq), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు సంయుక్తంగా మాట్లాడుతూ… ఏపీ అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి పెద్దపీట వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మన ప్రాంతానికి నంద్యాల జిల్లాలోని అష్టాదశ పీఠాలలో శక్తివంత పీఠమైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం రావడం అత్యంత సంతోషదాయకమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ పర్యటన మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి సభకు ఉమ్మడి నంద్యాల కర్నూలు జిల్లా నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు.

ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలనే దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి, సభకు తరలించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ కాదని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి నూతన పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయలసీమ ప్రజల తరఫున అపూర్వమైన, చారిత్రాత్మక స్వాగతం పలకడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని మంత్రుల బృందం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు , ఏవీఆర్ ప్రసాద్ , కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్, చెరుకు శ్రీదేవి, దూదేకుల జైనాబి, మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, కొండారెడ్డి, 14వ వార్డు ఖలీల్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి, ఉప్పరి సురేష్ కుమార్, గాలి చంద్రశేఖర్, కామిని మల్లికార్జున, చిన్నంశెట్టి శ్రీనివాసులు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల మండలం, గోస్పాడు మండలం ఎంపీడీవోలు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply