Pratap Reddy | సమస్యలు పరిష్కరిస్తా..
- అభివృద్ధి పరుగులు పెట్టిస్తా..
- సర్పంచ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ప్రతాప్ రెడ్డి
Pratap Reddy | మక్తల్, ఆంధ్రప్రభ : ఓటు వేసి ఆదరించి గెలిపిస్తే దాదన్ పల్లి గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని దాదన్ పల్లి బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జి.ప్రతాప్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. శనివారం దాదన్ పల్లి గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్డు సౌకర్యం కల్పిస్తానన్నారు.
సర్పంచ్ గా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా తనను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందిస్తానన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తానన్నారు. ఈకార్యక్రమంలో బి.వెంకటన్న, లింగప్ప, గంగప్ప, కురువ భీమన్న, గోకరి భీమన్న, మీదిగేరి హనుమంతు, బళ్లారి హనుమంతు, గుగ్గుళ్ల ఆంజనేయులు, బొంపల్లి అశోక్ ,భీమ్లమ్మ, శంకరమ్మ, జయమ్మ, లక్ష్మి ,అంజమ్మ ,మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

