అహ్మదాబాద్ : అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా (Air India) విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే (Air India Flight Crash). ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు.