Pensions | రెండేళ్లలోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత..

Pensions | రెండేళ్లలోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత..

  • సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం…
  • మా సర్పంచులను వేధిస్తే ఊరుకోం..
  • ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు
  • అధికార పార్టీ బెదిరింపులకు భయపడొద్దు..
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Pensions | రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని తెలంగాణ భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ, వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు(Pensions), మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం(70 percent) స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్ను కాపాడలేకపోయారన్నారు.

మంత్రులు ఎమ్మెల్యేలు(MLAs) కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా భయపడకుండా ప్రజలు మా పార్టీ నేతలు నిలబడ్డారని, అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీని గెలిపించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల నెలకొన్న తీవ్రమైన అసంతృప్తికి వ్యతిరేకతకు పంచాయతీరాజ్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు.

రాష్ట్రం(State)లో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బిఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

మిమ్మల్ని సస్పెండ్(suspended) చేస్తాం, ఇబ్బంది ఎడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించాలన్నారు. ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుందని, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదామని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్(Finance Commission) నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మిగిలిన విడత ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు కష్టపడి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో కేవలం 3శాతం ఉన్న తెలంగాణ, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చె సుకుందని, ఇది కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమన్నారు. ఈ రికార్డును దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేదన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ వ్యవస్థకు కేంద్రం నుంచి అనేక అంశాల్లో ఉత్తమ గ్రామపంచాయతీలు ఉత్తమ జిల్లా పరిషత్తు(Zilla Parishad)లు అవార్డులను దక్కించుకున్నాయన్నారు.

Leave a Reply