Pahalgam Attack: ఉగ్రవాదుల ఆచూకీ చెబితే భారీగా నగదు బహుమతి

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఉగ్రవాదుల ఏరివేతకు లోయలో గాలిస్తున్నారు. ఈ సమయంలో అనంత్ నాగ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించినవారికి రూ. 20లక్షల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని బైసరన్, పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను హతమార్చడానికి దారితీసే సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని అనంత్‌నాగ్ పోలీసులు ఒక పోస్టర్ విడుదల చేశారు. సమాచారం ఇచ్చేవారి గుర్తింపు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మీరు ఇక్కడ సమాచారాన్ని అందించవచ్చు

9596777666 – SSP అనంతనాగ్ 9596777669 – పిసిఆర్ అనంతనాగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *