న్యూ ఢిల్లీ – ఆపరేషన్ సిందూర్ వన్ ముగిసి 24 గంటలు గడవక ముందే సిందూర్ 2 ఆపరేషన్ కు తెరలేపింది భారత్.. మొదటి ఆపరేషన్ లో ఉగ్రస్థావరాలు ధ్వంసంగా ముందుకు ఆర్మీ ఈసారి తమ టార్గెట్ లను పాక్ లోని ఆర్మీ క్యాంప్ లపై పెట్టింది.. భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నించింది.. గత అర్ధరాత్రి నుంచి భారత్ పైకి మిసైల్స్ను ప్రయోగించింది. అయితే .. భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని సమర్థంగా అడ్డుకుంది. మధ్యలోనే వాటన్నింటిని కూల్చి వేసింది. వాటి శిధిలాలు కొన్ని పాకిస్తాన్లో పడగా మరికొన్ని భారత్ సరిహద్దులలో పడ్డాయి. చైనాకు చెందిన బీవీఆర్ మిసైల్స్తో జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించిందని ఆర్మీ వెల్లడించింది. అయితే.. వాటన్నింటికి కూల్చవేశామని తెలిపింది.

దీనికి ప్రతిగానే త్రివిధ దళాలు సిందూర్ 2కి రంగంలోకి దిగాయి.. ఇజ్రాయేల్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక హరూప్ డ్రోన్ లను రంగంలోకి దించింది.. కరాచీ, లాహోర్, సియోల్ కోట్, సహా ఇతర ప్రధాన నగరాలపై దాడి చేసి పాక్ కు చుక్కలు చూపిస్తోంది. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ భారీగా ఎదురుదాడులు చేస్తోంది. లహోర్ లోని పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్పై చేసిన దాడిలో ఏకంగా అర్మీ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. చైనా నుంచి HQ-9 రక్షణ వ్యవస్థను పాక్ కొనుగోలు చేసింది.. ఈ వ్యవస్థ ఏకంగా రూ.1600 కోట్లు.. మొత్తం భారత్ డ్రోన్ దెబ్బతో సర్వనాశనం అయింది..
లాహోర్, కరాచీ ఇంకా పాకిస్థాన్ లోని ఇతర ప్రదేశాలలో భారత్ వరుస డ్రోన్ దాడులు నిర్వహించిందని పాకిస్తాన్ సైన్యం దృవీకరించింది.. ఇస్లామాబాద్ మినహా అన్ని ప్రధాన నగరలోని ఆర్మీ బేస్ లపై దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.. ఒక డ్రోన్ దాడితో రావల్పిండిలోని క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది.