Open house | తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి

Open house | తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి

Open house | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను తప్పనిసరిగా గౌరవించాలని ఆచార్య రమేష్ గురూజీ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని అంబిటాస్ స్కూల్లో ఈ రోజు ఓపెన్ హౌస్(Open house) అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య రమేష్ గురూజీ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ధ్యానం, మౌనం, ఆధ్యాత్మికత యొక్క అర్ధాన్ని వివరించారు. అలాగే నేటి వ్యవస్థలో తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మంచిగా చూసుకోవాలని, వారి అవసరాలను తీర్చాలని, తల్లిదండ్రులకు ప్రతిరోజు సేవ చేయాలని, తల్లిదండ్రులే మొదటి దైవం అని తెలిపారు.

Open house |

విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాద పూజ చేశారు. స్కూల్ చైర్మన్ కె జైపాల్ రెడ్డి, డైరెక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్ అంబిక, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Open house |

CLICK HERE TO READ MORE : Venezuela Crisis  అమెరికా ఆయిల్​ కాలనీ Andhra Prabha Analysis

CLICK HERE TO READ MORE :

Leave a Reply