- క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు..
- వచ్చే ఎన్నికలలో మన సత్తా చాటాలి
- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
నిజామాబాద్ నగరంలోని బసవ గార్డెన్ లో పట్టణ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు.. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తా మనీ షబ్బీర్ అలీ సూచించారు. కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అనుబంధ సం ఘాల ప్రెసిడెంట్లు పార్టీ డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు.