Nov 14 th | వేడుకగా..
Nov 14, వర్ధన్నపేట, ఆంధ్రప్రభ: ఆల్ ఫోర్స్ హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పరిపాలన పట్ల అవగాహన కల్పించాలని పరిపాలన ప్రభావాలను తెలియచేస్తే.. వారు కూడా పలు కార్యకలాపాలను చక్కగా నిర్వహిస్తారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. వర్ధన్నపేట స్థానిక ఆల్ఫోర్స్ హై స్కూల్ (సీబీఎస్ఈ ) లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాయకత్వపు లక్షణాలను తెలియపరచాలని నాయకత్వపు లక్షణాల విశిష్టతను తెలియచేస్తే.. వాటిని పెంపొందించుకుంటారని అన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తరగతి గదిలోని విషయాలను నేర్చుకోవడమే కాకుండా సమాజం పట్ల విస్తృతంగా అవగాహనను పెంపొందించుకుని ముందంజలో నిలవాలని సూచించారు. విద్యార్థులకు ఈ పండుగ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నా.. స్వయం పరిపాలన దినోత్సవాన్ని వేడుకగా చాలా ఉత్సాహంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయమన్నారు.
విద్యార్థులు చక్కటి విషయాలను వారి మిత్రులతో పంచుకోవడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సింహాద్రి, వేణు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

