National Highway | నడిరోడ్డులో జనం తల్లడిల్లారు

National Highway | నడిరోడ్డులో జనం తల్లడిల్లారు

ఇది హైవే కాదు .. హెల్​ వే
అధికారులకు వినోద చిత్రం

National Highway | దగదర్తి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రభ : సిమెంట్​ ట్యాంకర్​ డ్రైవరు తప్పతాగాడు. దారి మర్చిపోయాడు. అంతలోనే రూటు మార్చే క్రమంలో నడిరోడ్డుపై విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా జనం 8 గంటలపాటు అల్లాడిపోయారు. దారి తెన్నూ లేక తల్లడిల్లిపోయారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో సంచలనం రేపింది. వివనాలు ఇలా ఉన్నాయి. కృష్ఱపట్నం నుంచి సిమెంట్​ బల్కర్​ ట్యాంకర్​ కడపకు బయలుదేరింది, నెల్లూరు దాటిన తరువాత ఆ ట్యాంకర్​ కడప రోడ్డులోకి వెళ్లాలి. కానీ పూటుగా మద్యం తాగిన డ్రైవరు కడపకు వెళ్లే రోడ్డును మర్చిపోయాడు. కావలి వైపు కనీసం 35 కిలోమీటర్లు దాటిన తరువాత.. స్సృహలోకి వచ్చాడు.

National Highway

ఇంకేముదీ.. ట్యాంకర్​ రూటు మార్చే పనిలో అదుపు తప్పాడు. అక్కడ ఓ డివైడర్​ ను తప్పించే క్రమంలో ట్యాంకర్​ రోడ్డుకు అడ్డం తిరిగింది. అంతే 16వ నంబరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గంటల నుండి వాహన చోదకులు, పోలీసులకు జాగారణ ప్రారంభమైంది. ట్రాఫిక్ స్థంభించింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర సింగిల్ లైన్ రోడ్డు కావడంతో ట్రాఫిక్​ క్రమబద్ధీకణకు ఇబ్బందులు తప్పలేదు. నిజానికి ఈ రూటులో ప్రమాదాలు జరిగితే గంటలు తరబడి ట్రాఫిక్ స్థంభిస్తోంది. టోల్ ఫీజులు మాత్రం వసూలు చేసే నేషనల్​ హైవే అధికారులు ఈ సమస్యను పట్టించుకోవటం లేదు. నిరంతరం ట్రాఫిక్​ కు అంతరాయం కలుగుతుంటే.. ఇటు పోలీసుకలకు సైతం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈ రోడ్డుపై ప్రజల అవస్థలను కళ్లప్పగించి ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు, రహదారి నిర్వహణ సంస్థ అధికారులు చూస్తున్నారు. ఇదీ మన ఆఫీసర్ల తీరూతెన్నూ..

Leave a Reply