Nandyala | కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్… భారీగా వాహ‌నాలు సీజ్

నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ – …నంద్యాల జిల్లా లో ఆత్మకూరు సిద్దాపురం నందికొట్కూరు సిరివెళ్ల ఎర్రగుంట్ల ఉండమన్నాయినిపల్లె పెసర వాయి వంటి పలు గ్రామాలలో ఆదివారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆత్మకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాము , నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు టౌన్ లోని మారుతి నగర్ లో , శిరివెళ్ళ ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల గ్రామంలో , అవుకు సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో కొండమనాయుని పల్లె గ్రామంలో, పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గడివేముల సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో పెసరవాయి గ్రామంలో పోలీస్ అధికారులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో సరైన ధ్రువపత్రాలు లేని 40 మోటార్ సైకిల్స్ ని, 21 క్వార్టర్ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.ఎర్రగుంట్ల గ్రామంలో సిరివెళ్ల ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు సరైన ధ్రువపత్రాలు లేని 8 మోటర్ సైకిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.


కొండమనాయునిపల్లి గ్రామంలో అవుకు సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి కార్డెన్ సెర్చ్ లో భాగంగా 50 లీటర్ల నాటు సారాయిని, సరైన ధ్రువపత్రాలు లేని 6 మోటర్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పెసరవాయి గ్రామంలో పాణ్యం ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన దృవపత్రాలు లేని 13 మోటార్ సైకిళ్లు , 15 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం శ్రీనివాసులపై కేసు నమోదుచేశారు.

Leave a Reply