నంద్యాల కలెక్టర్ వార్నింగ్
నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : బంగాళాఖాతంలో మోంతా తుపాను దూసుకు వస్తున్న తరుణంలో.. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి(Collector G. Rajakumari) అధికారులను ఆదేశించారు. విపత్తు నివారణ నిర్వహణపై జిల్లా, మండల స్థాయి అధికారులతో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్ఓ రాము నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ.. మోంతా తుఫాను(Montha Cykola) చెన్నై తీరం వైపు నుంచి విశాఖపట్నం దిశగా గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కదులుతోందని, ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని… అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లాలో సుమారు 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, అందులో 200 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని, వీటి చెరువు కట్టలను బలపరచాలని సంమైనర్ ఇరిగేషన్(Summiner Irrigation) అధికారులకు కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అన్ని విభాగాల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్(Control Room)లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08514–293903 ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వ వచ్చన్నారు.

