లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : లంచగొండి మున్సిపల్ అధికారులు (Municipal officials) మరోసారి ఏసీబీ వలలో చిక్కారు. పెద్దపల్లి (Peddapally) జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నెంబర్ కోసం ప్రసాద్ దరఖాస్తు చేసుకున్నాడు. దీని కోసం ఉద్యోగులు వినోద్, విజయ్ లు రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా నేడు దరఖాస్తుదారుడు ప్రసాద్ నుండి వినోద్, విజయ్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఏసీబీ (ACB) డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఈ దాడిలో ఏసీబీ ఇన్ స్పెక్టర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.