ADB | కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన‌ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, మే 2 (ఆంధ్రప్రభ) : అటవీ అధికారులు కేసులు పెడతామని భయపెడితే భయపడకండి, తాను మీ వెంట ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 39మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ… సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకొని తీవ్ర ఎండలకు బయట తిరగొద్దని ఆయన కోరారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో రాంప్రసాద్, డిప్యూటీ త‌హ‌సీల్దార్ అమృత్ లాల్, పుత్తూరు ఎంపీ ఓ సుధీర్ రెడ్డి, ఆదిలాబాద్ ఆర్టీఏ సభ్యులు దూటరాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ఉటూరు మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, కాంగ్రెస్ నాయకులు మర్సకోళ తిరుపతి, నిషార్, కొత్తపెళ్లి మహేందర్ రాజేష్ జాదవ్, ప్రభాకర్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply