MLA | రూ.18 కోట్లతో రహదారుల అభివృద్ధి
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గ పరిధిలో రూ.18 కోట్లతో ఆర్ అండ్ బీ (R and B) రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు కనుమరుగైతే…. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో నియోజకవర్గంలోని గ్రామాల్లో 276 కొత్త రోడ్లు వేశామని గర్వంగా చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు – మోటూరు రహదారికి రూ.2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ రోజు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు…. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎనర్జీఎస్, జిల్లా పరిషత్, సీఎస్ఆర్ (CSR) నిధులు కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఒక్క ఆర్అండ్బీ శాఖ ద్వారానే రూ.11 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేయగా, మరో ఏడు కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఇవి కాక నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లో మూడు కోట్ల రూపాయలు మంజూరు కానున్నట్లు ఆయన చెప్పారు.

కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ (market) యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పండ్రాజు సాంబయ్య, నిమ్మగడ్డ సత్యసాయి, ఆర్ అండ్ బీ డీఈ జే.కామేశ్వరరావు, ఎండిఓ విష్ణు ప్రసాద్, డిప్యూటీ ఎండీఓ నర్సింహారావు, టీడీపీ దొండపాడు గ్రామ అధ్యక్షుడు ముక్తినేని అమరబాబు, డీసీ నూతక్కి కుటుంబరావు , పీఏసీఎస్ అధ్యక్షులు ముసునూరి రాజేంద్ర, నీటి సంఘం అధ్యక్షులు వీర బసవయ్య, సర్పంచ్ గుడివాడ శ్రీను, గ్రామ టీడీపీ నాయకులు చోరగుడి బుజ్జి, తుమ్మల రత్నాకరరావు, లింగమనేని ప్రసాద్, మార్కెట్ యార్డు లింగం శివరావు, నక్కా పండు, బలరాం, గుత్తా వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాసరావు, నిమ్మగడ్డ ప్రకాశరావు, తమ్మారెడ్డి వెంకటేశ్వర రావు, జనసేన గ్రామ అధ్యక్షుడు బాబూజీ, టీడీపీ మల్లాయి పాలెం గ్రామ అధ్యక్షుడు ఉంగరాల మురళి, డీఎన్ రవి దొండపాడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

