న్యూ ఢిల్లీ – భారత నావికాదళం ఇవాళ తన తాజా స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ ను టెస్ట్ ఫైర్ చేసింది. సముద్ర ఉపరితలంపై నుంచి దూసుకెళ్లే తక్కువ ఎత్తులో వెళ్లే వేగవంతమైన క్షిపణి ఇది. ఐఎన్ఎస్ సూరత్ తన లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుని నాశనం చేసిందని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ విజయవంతమైన పరీక్ష భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో మరో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పరీక్ష జరిగింది. సదరు దాడి 26 మంది ప్రాణాలను బలిగొంది. ఐఎస్ఐ. పాక్ సైన్యం ఈ మారణహోమానికి కుట్ర పన్నినట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో తాజా టెస్ట్ ఫైర్ పాకిస్తాన్కు ఒక వార్నింగ్ గా ట్రీట్ చేస్తున్నారు.
అంతేకాదు, ఇవాళ లేదా రేపు పాకిస్తాన్ తన కరాచీ తీరప్రాంతం నుండి, దాని ప్రత్యేక ఆర్థిక మండలంలో, ఉపరితలం నుండి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షను నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో మన టెస్ట్ ఫైర్ జరగడం విశేషం.
పరీక్షా ప్రయోగం వీడియోను పంచుకుంటూ, భారత నావికాదళం.. తాజా స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ ఎస్ సూరత్ సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యాన్ని విజయవంతంగా నిర్వహించిందని, ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది.