విజయవాడ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
AP | మాజీ మంత్రి దేవినేని కుమారుడి వివాహ వేడుకల్లో మంత్రి లోకేష్
