Congress | ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్

  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌ల నియామ‌కం

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త‌ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం

ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ప్ర‌స్తుతం దీపాదాస్‌ మున్షీ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జిగా ఉండ‌గా.. ఆమే స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేర‌కు కెసి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయ‌ని పేర్కొన్నారు.

కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శులు

  • భూపేష్ బఘేల్ – పంజాబ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్ – జమ్మూ & కాశ్మీర్, లడఖ్‌లకు జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు

  • రజనీ పాటిల్ – హిమాచల్ ప్రదేశ్ & చండీగఢ్
  • బి.కె. హరిప్రసాద్ – హర్యానా
  • హరీష్ చౌదరి – మధ్యప్రదేశ్
  • గిరీష్ చోడంకర్ – తమిళనాడు & పుదుచ్చేరి
  • అజయ్ కుమార్ లల్లు – ఒడిశా
  • కె. రాజు – జార్ఖండ్
  • మీనాక్షి నటరాజన్ – తెలంగాణ
  • సప్తగిరి శంకర్ ఉలక – మణిపూర్, త్రిపుర, సిక్కిం & నాగాలాండ్
  • కృష్ణ అల్లవారు – బీహార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *