May day greetings | శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు – రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాప్రభుత్వం పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. మే డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. తాము అధికారం చేపట్టిన వెంటనే గిగ్‌ వర్కర్ల కోసం రూ.5లక్షల ప్రమాద బీమాను అమలు చేశామని తెలిపారు. ఇక, తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమ బిల్లు-2025ను త్వరలో తీసుకువస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేశామన్నారు. గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.

Leave a Reply