ఛత్తీస్ఘడ్ బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలైయినట్లు సమాచారం అందుతుంది.
కాగా ప్రస్తుతం భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సంఘటన స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ని బస్తర్ పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.