Maoist | 11మంది భద్రతా సిబ్బందికి గాయాలు

Maoist | 11మంది భద్రతా సిబ్బందికి గాయాలు
Maoist | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టలో మావోయిస్టుల కదలిక, IED బాంబులు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో జవాన్లు గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు. వారికి చికిత్స అందించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు.
