Mamatha | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

Mamatha | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
Mamatha | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ఇటుకాలపెళ్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గ్రామస్తులంతా అవకాశం ఇస్తే.. ప్రజల సేవకుడిలా పని చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాళ్లపెళ్లి మమత అశోక్ గౌడ్ అన్నారు. కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సేవ చేయడం తన లక్ష్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ సూచన మేరకు.. ఇటుకాలపెళ్లి గ్రామ కమిటీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాల సూచనలతో పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా వెల్లడించారు. తాళ్లపెళ్లి మమత అశోక్ గౌడ్ గ్రామాభివృద్ధికి తోడ్పడుతారని ఆశిస్తూ.. తన స్వంత పనుల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్థారనే ఉద్దేశంతో సర్పంచ్ పదవికి పోటీ చేయించారని అన్నారు. గ్రామ ప్రజల మద్దతుతో ఇటుకాలపెళ్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని తాళ్ళపెల్లి మమత అశోక్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.
