ఎకానా స్టేడియంలో ఢిల్లీ తో జరుగుతున్న పోరలో తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. లక్నో ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ చెలరేగినప్పటికీ.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఐడెన్ మార్క్రామ్ (52), మిచెల్ మార్ష్ (45) కలిసి ఢిల్లీ బౌలర్లను దంచేశారు. అయితే, ఆలస్యంగా తేరకున్న డీసీ బౌలర్లు.. వరుసగా వికెట్లు తీసి లక్నోను కష్టాలో పడేశారు.
నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2), కెప్టెన్ రిషబ్ పంత్ (0) కే పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇక డేవిడ్ మిల్లర్ (14 నాటౌట్), ఆయుష్ బదోని (36) పరువాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ నాలుగు వికెట్లతో విజృంభించాడు. మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్కు దిగనుంది.