తప్పిన ప్రాణాపాయం
కాలిపోయిన విద్యుత్ సర్క్యూట్
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.అయితే కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం తూపల్లిలో చిన్నపరెడ్డి అనే రైతు ఇంటి మేడపై శుక్రవారం రాత్రి పిడుగు పడింది. ఆ సమయంలో ఇంటి మేడపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే పిడుగుపాటుకు షాట్ సర్క్యూట్ అయ్యి ఇంటిలోని విద్యుత్ వైర్లు విద్యుత్ వైర్లు కాలిపోయాయి.