Lighting | కూంబింగ్ లో విషాదం .. పిడుగుపాటుకు సీఆర్పీఎఫ్ ఆఫీస‌ర్ క‌న్నుమూత

రాంచీ : జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. అడ‌వుల్లో కూంబింగ్‌కు వెళ్లిన ఓ సీఆర్పీఎఫ్ ఆఫీస‌ర్ పిడుగుపాటుకు మృతి చెందారు. మ‌రో అధికారి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని కెరిబూరు గ్రామ స‌మీపంలోని అడ‌వుల్లో గురువారం రాత్రి సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు కూంబింగ్ చేప‌ట్టాయి. రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురిసింది. అడ‌విలో పిడుగులు కూడా ప‌డ్డాయి. పిడుగుపాటుకు సీఆర్పీఎఫ్ అధికారి ఎం ప్ర‌భో సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మ‌రో అధికారి ఎస్కే మండ‌ల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. ప్ర‌భో సింగ్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని అధికారులు భ‌రోసానిచ్చారు.

Leave a Reply