రామగుండం, ఆంధ్ర ప్రభ : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం అర్థరాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం, రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికులతో మాట్లాడారు. ప్రధానంగా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ కార్య క్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, రవీందర్, రామగుండం ఎస్ఐ సంధ్య రాణి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
KNR | అర్ధరాత్రి వేళ సిపి ఆకస్మిక తనిఖీలు..
