ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఈరోజు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో లక్నో జట్టు విజయం సాధించింది. కోల్కతా సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లో.. ఎల్ఎస్జి జట్టు కోల్కతాను 234 పరుగులకు పరిమితం చేసి 4 పరుగుల తేడాతో గెలుపొందింది.
కాగా, 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కెకెఆర్ పవర్ ప్లేలో దంచికొట్టింది. కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. కెప్టెన్ రహానె (35 బంతుల్లో 61) హాఫ్ సెంచరీ సాధించగా.. సునీల్ నరైన్ (30), వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 45) విజృంభించారు.
సునీల్ నరైన్ – రహానే కలిసి రెండో వికెట్ కు 54 పరుగులు అందించగా.. మూడో వికెట్ కు రహానే, వెంకటేష్ అయ్యర్ 71 పరుగులు జోడించారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న నరైన్ – రహానే – వెంకటేష్ అయ్యార్ జోడీని విడదీశారు.
ముందుగా భారీగా పరుగులు సమర్పించుకున్న లక్నో బౌలర్లు పుంజుకుని.. కోల్కతా జట్టును కష్టాల్లోని పడేశారు. నరైన్, రహాన్, వెంకటేష్ ఆ తరువాత వచ్చిన ప్లేయన్లు స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు.
13 ఓవర్లలో 162 పరుగులకు మూడు వికెట్లే కోల్పోయిన కోల్కతా… 16.1 ఓవర్లలో 185 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖర్లో వచ్చిన రింకు సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్) బౌండరీ బాదాడు. అయితే, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది, దాంతో కోల్కతా జట్టు విజయ తీరాలకు చేరుకోలేకపోయింది.
లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టగా, అవేష్ ఖాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జేయింట్స్.. కోల్కతా బౌలర్లకు ఉతికారేసింది. కేవలం టాపార్డర్ ముగ్గురు ప్లేయర్లు కలిసి కేకేఆర్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఐడెన్ మార్కరమ్ (28 బంతుల్లో 47) పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్) అర్దశతకాలతో పరుగుల సునామీ సృష్టించారు. దీంతో లక్కో స్కోర్ భారీగా నమోదైంది.