ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే మూడు జట్లు ఈ సీజన్ నుంచి నిష్క్రమించగా, మరో ఏడు జట్లు ప్లేఆఫ్స్లో చోటు కోసం పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్స్ ఆశలతో ఈ సీజన్ లో సజీవంగా ఉన్న ఢిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా.. ఈడెన్ గార్డెన్స్ వేదికిగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ కీలకమైన మ్యాచ్ లో… కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో చెన్నై జట్టు బౌలింగ్ చేయనుంది.
తుది జట్లు :
చెన్నై సూపర్ కింగ్స్ : ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోని (కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీషా పతిరానా.
కోల్కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, మనీష్ పాండే, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ప్రతీ మ్యాచ్ కీలకం..
ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకం కావడంతో.. గెలుపే లక్ష్యంగా కొల్కతా జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధమౌతుంది. గత రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్పై సాధించిన విజయాలు కోల్కతాను ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ల రేసులో సజీవంగా ఉంచాయి.
ప్రస్తుతం 11 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉన్న కేకేఆర్, నేటి మ్యాచ్తో సహా ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి ఆ మూడు మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అయితే అప్పుడు కూడా కోల్కతా ఇతర జట్ల విజయాలు, ఓటములపై ఆధారపడవలసి ఉంటుంది. మరి ప్రతి మ్యాచ్ ఇప్పుడు డూ ఆర్ డైగా మారడంతో… డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా ఎలా రాణిస్తుందో చూడాలి.
తగ్గనంటున్న గాయపడిన సింహం
మరోవైపు, ఈ సీజన్ నుండి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్… కనీసం తమ సీజన్ను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. గాయపడిన సింహంలా.. ఇప్పటికీ తమ ప్రత్యర్థులకు తీవ్ర పోటీనిస్తూ.. విజయాల కోసం చెన్నై జట్టు పోరాడుతూనే ఉంది.
గత మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయారు. సీజన్ చేజారినప్పటికీ.. ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించడంలో చెన్నై జట్టు వెనుకడుగు వేయడం లేదు. దీనితో కేకేఆర్ – సీఎస్కే మధ్య నేటి మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.