గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ అప్కమింగ్ మూవీ ‘‘కింగ్ డమ్’’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా కనిపంచనుంది.
ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్… జూలై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని మొదట మే 30న విడుదల చేయాలని నిర్ణయించారు.
