Khanapur | పంట పొలాలకు సాగునీరు అందించడమే ధ్యేయం – ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, (ఆంధ్రప్రభ): రైతులందరి పంట పొలాలకు సాగునీటి అందించడమే తమ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయం ఆవరణలో రూ.35.5 లక్షలతో నిర్మించనున్న నూతన భవనానికి సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా రెండు పంటలకు నీరు ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు.ఈ ప్రాంత రైతాంగానికి ఖరీఫ్ కు రబీ పంటలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ విటల్,డిప్యూటీఈఈ వెంకటేశం, ఎఈఈలు శ్రవణ్ కుమార్,కె.శ్రావణ్ కుమార్, స్థానిక తహసిల్దార్ రాజమోహన్ రెడ్డి,ఎంపీడీవో హుమర్ షరీఫ్, నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ మామిడి శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply