శిక్షను ప్రకటించిన అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ భవేజా
ఇప్పటికే అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సజ్జన్
హత్య కేసులో కూడా దోషిగా నిర్ధారణ
ఈ కేసులోనై జీవిత ఖైదుగా శిక్ష ఖరారు.
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల లో జరిగిన హత్యల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు శిక్ష విధించారు.. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆయన్ని దోషిగా ప్రకటించారు. అయితే శిక్ష ఖరారుపై వాదనలను మాత్రం ఈ నెల 18వ తేదీన జరిగాయి. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ నేపథ్యంలోనే నేడు తీర్పువెలువరించారు న్యాయమూర్తి .
కాగా, 1984 నవంబర్ 1న సరస్వతి నిహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బామ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్ పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. ఈ క్రమంలో సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ను హతమార్చింది. అయితే.. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్గొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహిందాడని కోర్టు నిర్ధారించింది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.దీంతో ఆయనకు జీవిత శిక్ష విధిస్తునట్లు కోర్టు ప్రకటించింది.
ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్బిఎంసీ) ప్రధాన కార్యదర్శి బిగ్లిప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్సా సిట్ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు
తెలిపారు.
అల్లర్ల కేసులోనూ జీవిత ఖైదు
ఇక ఢిల్లీ కంటోన్మెంట్ జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావదైన కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ను దోషిగా నిర్థారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్ కు దివంగత నేత సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధా ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.