వెలగపూడి : ఏపీలో సంచలనం సృష్టించి ముంబై నటి జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. నటి జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానా తాతా, పోలీసు అధికారులు ఏసీపీ హనుమంతరావు, సత్యనారాయలపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే క్వాష్ పిటిషన్లపై తుది విచారణను జూన్ 30కు హైకోర్టు వాయిదా వేసింది.
Jethwani Case: ఇద్దరు ఐపీఎస్లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
