Janasena | కార్యకర్తల కుటుంబాలకు అండగా పవన్ కల్యాణ్

హైదరాబాద్ – తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంకు చెందిన కేతావత్ హరి సింగ్ , మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బొప్పల జమున, నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గకు చెందిన కుర్ర సైదులు జనసైనికుల కుటుంబాలకు కూకట్ పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కావ్య మండపాక, ఆర్కే సాగర్ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా శంకర్ గౌడ్ , మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకు ఆసరా ఉండాలన్న ఆలోచనతో పవన్ తీసుకువచ్చిన ఈ బీమా సౌకర్యం ఎంతోమంది జనసేనకుల కుటుంబాలకు భరోసాను కల్పిస్తుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యడమ రాజేష్ ,కొల్లా శంకర్ , సరి కొప్పుల నాగేశ్వరరావు, జమ్మన్న, రవీందర్ చవాన్, సాంబశివుడు, మహబూబ్, శ్రీను ఇతర నియోజకవర్గ నాయకులు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *