- 4వ టెస్టు, డే 2 లంచ్ రిపోర్ట్
- లంచ్: భారత్ 321/6 (105 ఓవర్లు)
- వాషింగ్టన్ సుందర్ 20, రిషబ్ పంత్ 39
ఇంగ్లండ్పై 4వ టెస్టు రెండవ రోజు లంచ్ సమయానికి భారత్ 321/6. రిషబ్ పంత్ గాయంతోనూ బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా ముందుగానే లంచ్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మాంచెస్టర్ : ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో రెండవ రోజు ఉదయం సెషన్ లో భారత్ 57 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన వర్షం కారణంగా ముందుగానే లంచ్ ప్రకటించేశారు.
రెండవ కొత్త బంతితో ఇంగ్లండ్ దాడి ప్రారంభించింది. జోఫ్రా ఆర్చర్ రెండవ ఓవర్లోనే రవీంద్ర జడేజాను (20) అవుట్ చేశాడు. తర్వాత షార్దూల్ ఠాకూర్ 88 బంతుల్లో 41 పరుగులు చేసి కొంత సమయానికి ప్రత్యర్థిని అడ్డుకున్నాడు. కానీ చివరకు బెన్ స్టోక్స్ అతడి పోరాటానికి ముగింపు పెట్టాడు.
కాలి గాయంతో నిన్న ఆటకు దూరమైన పంత్… నేడు ధైర్యంగా బరిలోకి దిగాడు. రిషబ్ పంత్ కు అభిమానులు గట్టిగా చప్పట్లు కొట్టారు. అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ చక్కగా భాగస్వామ్యం కొనసాగించాడు. ఆర్చర్, క్రిస్ వోక్స్ ల ధాటికి ఎదురొడి నిలిచాడు. ఆ సమయంలో వర్షం మొదలై ఆటకు విరామం కలిగింది.
మళ్లీ ఆట ప్రారంభమైనప్పుడు పంత్, సుందర్ జతగా స్కోరు ను మరింతగా పెంచాలని భారత్ ఆశిస్తోంది. అయితే, ఇంగ్లాండ్ వీలైనంత త్వరగా టెయిల్ ఎండ్ ను క్లీన్ చేయాలని చూస్తుంది.
ప్రస్తుతం వర్షం పడుతుండటంతో.. పిచ్ పై కవర్స్ వేసారు, అంపైర్ రాడ్ టక్కర్ రైన్ కోట్ వేసుకుని తిరుగుతున్నాడు. గ్రౌండ్ సిబ్బంది కూడా ఎదురుచూస్తున్నారు. అభిమానులు మిగతా ఆట నిలకడగా జరగాలని ఆశిస్తున్నారు.