ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నూతన నిబంధనలతో టెస్టు క్రికెట్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్ ప్రారంభం నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తాజా మార్పులతో అన్ని ఫార్మాట్లలో ఆట వేగాన్ని పెంచే దిశగా ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
- స్టాప్ క్లాక్ రూల్ (నిమిష నిబంధన):
ఇప్పటివరకు వన్డేలు, టీ20ల్లో ఉన్న ఈ నిబంధనను ఇప్పుడు టెస్టుల్లో కూడా తీసుకొచ్చారు. ప్రతి ఓవర్ ముగిసిన తర్వాత ఒక నిమిషం లోపలే తదుపరి ఓవర్ను ఫీల్డింగ్ జట్టు ప్రారంభించాలి. మొదట ఈ నిబంధనను రెండు సార్లు ఉల్లంఘిస్తే హెచ్చరికలు ఇస్తారు. మూడోసారి నుంచి ఆలస్యం చేసిన ప్రతిసారి, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు బహుమతిగా ఇస్తారు.
- లాలాజలంతో బాల్ మార్చే నిబంధన:
అనవసరంగా లాలాజలంతో బాల్ మార్పు ఇకపై ఉండదు. బౌలర్లు బంతిపై లాలాజలం (saliva) రాయడం వల్ల దాన్ని మార్చే అవసరం లేకుండా ఇప్పుడు ఈ నిబంధనను తీసేశారు. ఉద్దేశపూర్వకంగా లాలాజాన్ని ఉపయోగించే అవకాశాలను తగ్గించడమే లక్ష్యం.
- రెండో రివ్యూకు డెఫాల్ట్ డెసిషన్ – ఔట్:
ఒక బాట్స్మెన్ “కాచ్ ఔట్”కు రివ్యూకు వెళ్తే, తర్వాత “ఎల్బీడబ్ల్యూ” చెక్ చేసే సమయంలో ‘అంపైర్ కాల్’ వచ్చినా ఔట్గానే పరిగణిస్తారు. సెకండరీ డిస్మిసల్పై డిఫాల్ట్గా ఔట్ డెసిషన్ ఉంటుందని స్పష్టం చేశారు.
- రివ్యూలో క్రమపద్ధతి (ఆర్డర్):
ఒకే బంతికి రెండు రివ్యూలు వస్తే (ఉదాహరణకు: LBW, రన్ ఔట్), ముందుగా ఏ డిస్మిసల్ అయ్యిందో అది మొదట పరిశీలిస్తారు.
- నో బాల్ అయినా క్యాచ్ చెక్:
ఒక బంతి నో బాల్ అయితే… ఇప్పటివరకు క్యాచ్ ఫెయిర్గా ఉందా అనే విషయం చూడవలసిన అవసరం ఉండేది కాదు. ఇకపై నో బాల్ అయినా ఆ క్యాచ్ క్లీన్గా పట్టుకున్నారా లేదా అనే విషయాన్ని చెక్ చేయనున్నారు. క్యాచ్ ఫెయిర్ అయితే… ఒక్క నో బాల్ పరుగే ఇస్తారు. క్యాచ్ ఫెయిర్ కాకపోతే.. బ్యాటర్లు తీసిన పరుగులన్ని స్కోర్లో కలుపుతారు.
- కావాలనే షార్ట్ రన్ – కఠిన చర్య:
ఒక జట్టు కావాలనే షార్ట్ రన్ (అధిక రన్) తీయాలని చూస్తే, ఐదు పరుగుల పెనాల్టీ వర్తిస్తుంది. ఇంతకు ముందు దీని పర్యవసానంగా ఆటక్రమం కొనసాగేది. ఇప్పుడు ఫీల్డింగ్ జట్టు నిర్ణయం మేరకు తర్వాతి బంతికి ఎవరిని స్ట్రైక్పై ఉంచాలో నిర్ణయించుకునే అధికారం ఇస్తున్నారు.
- గాయపడిన ప్లేయర్కు స్థానిక ప్రత్యామ్నాయం – ట్రయల్:
ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఏ ప్లేయర్ కు అయినా తీవ్ర గాయం జరిగితే, ఆ ప్లేయర్ స్థానంలో ఒక స్థానిక ప్లేయర్ను జట్టు ఎంచుకునే అవకాశాన్ని ట్రయల్ ఆధారంగా అందించనున్నారు. దీనిపై అన్ని బోర్డులు ట్రయల్ నిబంధనలు అమలు చేయాలంటూ ఐసీసీ సూచించింది.
ఈ మార్పులు అన్ని ఫార్మాట్లలో ఆట నాణ్యతను పెంచడమే కాకుండా, ఆటను వేగంగా సాగించేలా చేస్తాయని ఐసీసీ అభిప్రాయపడింది. ఈ నూతన నిబంధనలు 2025 జూలై నుంచి అంతర్జాతీయ టెస్టుల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.